20 జూన్ 2016

ఆ పరిణతే చివరికి నిలిచేది.

ఎంత ధనమూ, అధికారమూ, విజ్ఞానమూ, కీర్తీ సంపాదించినా లోపల వాటిని పొందేవాడిలో ఏ పరిణతీ రాకపోతే, పొందినవి రవంతైనా ప్రతిఫలాపేక్ష లేకుండా పంచుకోవటం రాకపోతే, వాటి కోసం పరుగుపెట్టిన కాలమంతా వృధానే అనిపిస్తుంది.

జీవితంలో ఏదో ఒక దశలో, ఏదో ఒక ఖాళీ సమయంలో, తన లోపలి ఖాళీతనాన్ని తాను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎన్ని సాధించినా, మరి కాస్త అనుకంపన, మరికాస్త మెత్తదనం, మరి కొంచెం నిండుదనం, నెమ్మదీ, సరళత మన లోపల వెలగకపోతే, ఎంత డొల్లగా మన జీవితం మొదలయిందో, అంతకన్నా డొల్లగానే అదిముగుస్తుంది.

మన అహంకారం పట్ల మనకి స్పష్టమైన ఎరుక ఉండాలి. దానిని పెంచి పోషించుకోవటం పట్ల ఉదాశీనత ఉండాలి. అప్పుడుకదా, అది కరిగి జారిపోతున్నపుడల్లా మనలోంచి సత్యమో, సౌందర్యమో, దయో వెలుగులీనుతూ వ్యక్తమయ్యేది.

తమని తామే మోసగించుకొనే కాపట్యంకన్నాజాలి పడాల్సింది మరేదీ లేదేమో. 'తండ్రీ, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు.' అని ఆ జ్ఞాని అందుకే అన్నారా అనిపిస్తుంది.


~ బివివి ప్రసాద్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి