11 డిసెంబర్ 2014

'ఆకాశం' సంపుటికి నూతలపాటి కవితా సత్కారం

'ఆకాశం' సంపుటి నూతలపాటి కవితా సత్కారం - 2011 కు ఎంపికైంది. ఈ మేరకు 'ఆకాశం' కవితాసంపుటి కవి బివివి ప్రసాద్ ని నవంబరు 15 న తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో గంగాధరం సాహితీ కుటుంబం వారు ప్రశంసా పత్రం, నగదుతో సత్కరించారు. 

ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో గంగాధరం సాహితీ కుటుంబం అధ్యక్షులు విద్వాన్ ఎస్.మునిసుందరం, కార్యదర్శి ఆచార్య డి. కిరణ్ క్రాంత్ చౌదరి, ఆచార్య మేడిపల్లి రవికుమార్, కవులు బివివి ప్రసాద్, పలమనేరు బాలాజీ (నూతలపాటి కవితా సత్కారం - 2012 కు ఎంపికైన 'ఇద్దరిమధ్య' కవితాసంపుటి కవి), నూతలపాటి వెంకటరమణ పాల్గొన్నారు.

సభ విశేషాలు ఇక్కడి ఫొటోలు, ఆడియో, వీడియో లలో గమనించవచ్చును.


'ఆకాశం' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'ఇద్దరిమధ్య' పై మేడిపల్లి రవికుమార్ ప్రసంగానికి ఇక్కడ క్లిక్ చేయండి.

బివివి ప్రసాద్ ప్రసంగం వీడియోకు ఇక్కడ క్లిక్ చేయండి.

2 కామెంట్‌లు: