19 జులై 2016

బివివి ప్రసాద్ కి తిలక్ అవార్డు



ప్రసిద్ధకవి దేవరకొండ బాల గంగాధర తిలక్ పేరిట, తిలక్ రాసిన సాహిత్య ప్రక్రియలైన వచనకవిత్వం, పద్యం, కథ, నవల, నాటకం లలో ఏదైనా ప్రక్రియలో ప్రతిభావంతులైనవారికి, తిలక్ మిత్రులు శ్రీ తంగిరాల సుబ్బారావు, శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి ఇరవైయేళ్ళుగా బహూకరిస్తున్న తిలక్ అవార్డును ఈ సంవత్సరం బివివి ప్రసాద్ (వచన కవిత్వం) కు అందచేస్తున్నట్లు, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే తణుకు నన్నయ భట్టారకపీఠం కార్యదర్శి శ్రీ సుశర్మ తెలియచేసారు. అవార్డు ప్రదానం ఆగస్టు14న, తణుకులో జరుగుతుందని తెలిపారు.
గతంలో ఈ అవార్డు అందుకొన్న ప్రసిద్ధకవులు సర్వశ్రీ గుంటూరు శేషేంద్రశర్మ, ఇస్మాయిల్, సోమసుందర్, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, కె. శివారెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఎన్. గోపి, అద్దేపల్లి రామమోహనరావు, రసరాజు, ఎండ్లూరి సుధాకర్, కొప్పర్తి, పాపినేని శివశంకర్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి