తత్వశాస్త్ర సారం కవిత్వ ప్రక్రియలో ఒదుగుతుందా? నిజానికి కవీ తత్వవేత్తా ఒకే పాత్ర పోషించ గలరా? హృదయాన్ని గిలిగింతలు పెట్టే మహోద్వేగ జలపాతానికీ, మెదడుని అగ్నిపర్వతం వలే విస్ఫో టనానికి గురి చేసే సత్యాన్వేషణకీ లంకె వేయడం ఎప్పుడూ దుస్సాధ్య చర్య. 'కనబడని ఆనందంలోకి * తిరిగిరాకుండా తప్పిపోవాలి'; 'వాక్యాలకవతల ఖాళీ ఆకాశం ఉంటుంది'; 'జీవితం గాజుకన్నా అల్ప' మని .. బివివి ఒక్కో కవితా వాక్యం ఘనసముద్రమంత లోతుగా ఉంటుంది. పాఠకుడికి అసంకల్పి తంగా ప్రతి కవితలో ఒక మూర్తిమత్వం కదలాడుతుంది. కవి మానవీయ స్వరంలో ఆరాధనా భావం సున్నితమైనది. అంతమాత్రాన దీన్నేమీ భక్తి కవిత్వం అనకూడదు. పోనీ జ్ఞాన దాహంలానూ తోచలేదు. 144 కవితలున్నప్పటికీ ఇందులో విముక్త కాంక్షతో పలికే సారాంశ ధ్వని ఉంది. చెబుతున్నదెవరు, చెవి ఒగ్గి వింటున్నదెవరూ అన్న వ్యత్యాసం లేదు. అది తనని తాను తెలుసుకునే ఒక మనిషి ఆరాటమే. ఈ సౌందర్యం భిన్నమైనది. పరిణితి గలది. కవి తనలో అణచిపెట్టుకోలేని జీవన రహస్యాలన్నీ వెల్లువగా ప్రవహించిన కవిత్వ ధార ఇది.
- పుప్పాల శ్రీరామ్
ప్రతులకు : అనేక బుక్స్, విజయవాడ 92472 53884
ఆదివారం ఆంధ్రజ్యోతి 8.3.2026

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి